సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతూ మహేష్ బాబు స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది.
ఇక ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
మహర్షి లాంటి సక్సెస్ఫుల్ మూవీని అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
ఇటీవల వరుసగా తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్తో మ్యూజిక్ చేయించుకున్న మహేష్, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ను మార్చాలని చూస్తున్నాడు.అల వైకుంఠపురములో చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన థమన్ను మహేష్ తన సినిమాలో తీసుకోనున్నాడట.
దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
మొత్తానికి అల వైకుంఠపురములో మూవీకి థమన్ అందించిన సంగీతానికి మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యాడనే చెప్పాలి.