మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ అభినవ సావిత్రిగా తనకంటూ గుర్తింపుని సొంతం చేసుకుంది.అయితే మహానటి సినిమా తర్వాత తెలుగులో రెగ్యులర్ సినిమాలు కాకుండా పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.
తమిళంలో హీరోయిన కమర్షియల్ సినిమాలు చేస్తున్న తెలుగులో మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మహానటి తర్వాత తెలుగులో ఒకే చెప్పిన సినిమా మిస్ ఇండియా.
ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరిస్తున్నాడు.
ఇందులో కీర్తి సురేష్ మరోసారి తనదైన నటనని చూపించేందుకు సిద్ధం అవుతుంది.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాతలు ఫిక్స్ చేశారు.మార్చి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలకి కనెక్ట్ అయ్యే పాయింట్ ని ఇందులోప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇలాంటి పాయింట్ నా జీవితంలో కూడా ఉంది అని ప్రతి అమ్మాయి భావించే విధంగా కీర్తి సురేష్ పాత్ర ఉండబోతుందని నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు.
సినిమాని మొదట ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనీ అనుకున్న, పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వలన మార్చి ఫస్ట్ వీక్ కి వాయిదా వేసినట్లు తెలిపారు.మరి మహానటి తర్వాత కీర్తి చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడంతో దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.
వాటిని ఈ భామ ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.