స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ రావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూశారు.
కట్ చేస్తే.
సినిమా రిలీజ్ కావడం, పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడంతో బ్లాక్బస్టర్ కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి.ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే కలెక్షన్లు వస్తుండటతం రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది.
కాగా ఈ సినిమా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.సినిమా రిలీజ్ అయిన 8 రోజుల్లోనే రూ.కోటి కలెక్షన్స్ సాధించడంతో ఈ సినిమా కోటి రూపాయల క్లబ్లో చేరింది.
బన్నీ సినిమాల్లో ఈ ఫీట్ సాధించిన 5వ చిత్రంగా అల వైకుంఠపురములో నిలుస్తుంది.
ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా త్రివిక్రమ్ రూపొందించాడు.పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదనపు బలాన్ని చేకూర్చింది.ఇక ఈ సినిమా నైజాంలో రూ.30 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చాటుతోంది.ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.