తాజాగా ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి చిత్రం అల వైకుంఠపురములో.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బన్నీకి జోడీగా గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే, నివేత పేతురాజ్ నటించారు.
అలాగే ఈ చిత్రంలో టబు, జయరామ్, సునీల్, సుశాంత్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే సంక్రాంతి కానుకగా విడుదలైన టువంటి ఈ చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తూ థియేటర్లలో అంచనాలకు మించి దూసుకుపోతోంది.
అయితే ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో విశాఖపట్నం లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని అంతేగాక విశాఖపట్నం అంటే ముందుగా ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ఇక్కడి అందమైన అమ్మాయిలు కూడా గుర్తొస్తా రని అన్నారు.
అంతేకాక ఈ నగరంలో ఉన్నటువంటి బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తనకు సమయం వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి వెళుతూ ఉంటాయని అని తెలిపారు.
చిన్నప్పుడు తాను ఇక్కడే చదువుకున్నానని తనకు ఇక్కడ ఎన్నో మంచి స్మృతులు, జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.అంతేగాక విశాఖపట్నం ఎన్నో ఒంపులు తిరిగి ఉంటుందని, గొప్ప గొప్ప మేధావులను అందించిన నగరమని అందుకుగాను విశాఖపట్నానికి కృతజ్ఞతలు తెలిపారు.
.