151 మంది ఎమ్మెల్యేలకు రెండే బాత్‌రూంలు ఉన్నాయన రోజా

ఏపీ రాజధానిగా అమరావతిని తాను అభివృద్ది చేశాను అని, ఇప్పుడు రాజధానిని మార్చడం ఏంటీ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజా నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు గుప్పించారు.ఇప్పటి వరకు అమరావతిలో ఒక్క శాస్వత భవనం అనేది లేదు.

 Ycp Leader Roja Comments On Chandrababu Naidu-TeluguStop.com

అమరావతిలో నిర్మించినది ఏ ఒక్కటి కూడా పూర్తి సదుపాయలతో లేవు అంటూ రోజా ఎద్దేవ చేసింది.

చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఈ తాత్కాలిక అసెంబ్లీ భవనంలో కేవలం రెండు బాత్‌ రూంలు మాత్రమే ఉన్నాయి.151 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికి కేవలం రెండు బాత్‌ రూంలు ఎలా సరిపోతాయని కట్టారు అంటూ ప్రశ్నించారు.అన్ని వసతులతో ఉన్న హైదరాబాద్‌ అసెంబ్లీని వదిలి పెట్టి ఇక్కడకు హడావుడిగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నాడు.

చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టు పక్కల గ్రామాలకు మాత్రమే ప్రతి పక్ష నేతగా వ్యవహరిస్తున్నాడు.ఆయన ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు అంటూ కామెంట్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube