రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ సినిమా పింక్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకుడుగా వ్యవహరించనున్నాడు.ఇక ఈ సినిమా కథని పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు కమర్షియల్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు.
తమన్ ఈ సినిమాకి సంగీత సమకూర్చుతున్నాడు.తాజాగా ఈ సినిమా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్స్ట్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమాని నిర్మించిన ఏ.ఎం.రత్నంతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గతంలోనే ఒకే చెప్పగా అది ఇప్పుడు పట్టాలు ఎక్కబోతుందని సమాచారం.క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కబోతుందని సమాచారం.రాజకీయాంశాలతో ముడిపడి ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రాతో కలిసి క్రిష్ ఈ సినిమా స్క్రిప్ట్ పై ఇప్పటికే వర్క్ చేయడం మొదలెట్టాడని చెప్పుకుంటున్నారు.పింక్ సినిమా పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉండనే టాక్ వినిపిస్తుంది.
మరి ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఎంత వరకు నిలబెడతాయి అనేది చూడాలి.