ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే వరుస అవకాశాలను చేజిక్కించు కొంటూ అలాగే వాటిని సద్వినియోగం చేసుకుంటూ మంచి హిట్లు సాధిస్తూ దూసుకుపోతోంది.అయితే తాజాగా పూజా హెగ్డే నటించినటువంటి చిత్రం అలా వైకుంఠపురంలో.
ఈ చిత్రానికి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే క్రేజ్ ఎలా ఉందంటే దర్శకనిర్మాతలు పూజా హెగ్డే జపం చేస్తున్నారు.
అయితే ఇందుకు తగ్గట్టుగానే పూజా హెగ్డే కూడా తను నటన పరంగా అందరిని మెప్పిస్తూ రాణిస్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా జీవితంలో ఒక్కోసారి కొన్ని సాహసాలు చేయడం చాలా ముఖ్యమని, అలాంటి పరిస్థితుల్లో తాను సాహసం చేయడానికి వెనుకాడని అంతేగాక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తను ఏమాత్రం ఆలోచించాలని అన్నారు.అంతేగాక అందరూ తమ జీవితాన్ని ఒకే రకంగా జీవిస్తూ మరియు వాటికి అలవాటుపడి పోతున్నారని కానీ తాను మాత్రం అందుకు భిన్నంగా అని ఎప్పుడూ ఏదో ఒక అడ్వెంచర్ చేస్తూనే ముందుకు వెళుతూ ఉంటాం అని చెప్పుకొచ్చింది.
అంతేకాక జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయని, అలాంటి పరిస్థితుల్లోనే మన సత్తా ఏంటో మనకు తెలుస్తుందని వాటిని తట్టుకుని నిలబడితే నా జీవితంలో ఏదో అవుతామని పూజా హెగ్డే చెబుతోంది.అయితే ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో బాహుబలి ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది.