ధనవంతులు పెళ్లి వేడుకలను కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తూ ఉంటారు.అయితే ఆ వేడుకల్లో ఎదో ఒక చిన్న లోపం అయినా జరుగుతూనే ఉంటుంది.
ప్రతి పెళ్లి లో కూడా నిర్వాహకులు ఖచ్చితంగా వచ్చిన బంధువులను నూటికి నూరు శాతం సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఎంత చేసినా కూడా కొందరు పోకిరీలు మాత్రం పెళ్లిలో ఆగం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
ఎంత డబ్బు పెట్టినా కూడా కొన్ని పెళ్లిలలో ఎదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది.ఆ వెలితి నిర్వాహకులు ఎంత ఖర్చు చేసినా కూడా భర్తీ చేయలేరు.కానీ కొందరు తెలివైన మ్యారేజ్ ఈవెంట్ నిర్వాహకులు అలాంటి వెలితి భర్తీ చేసేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు.గుజరాత్ లో ఒక పెళ్లిలో ఇదే జరిగింది.
పెళ్లి వేడుకకు వచ్చిన బందు మిత్రులు తీవ్రమైన చలి తో బాధపడే అవకాశం ఉందని మంట పెట్టారు.
పెళ్లి వేడుకలో మంట ఏంట్రా బాబు అనుకునున్నారా.అసలు విషయం ఏంటి అంటే గుజరాత్ లోని రాజ్ కోట్ లో ప్రముఖ వ్యాపారవేత్త తన కూతురు వివాహంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.అయితే ఆ పెళ్లి వేడుక రాత్రి అవ్వడంతో పాటు చలి కాలం అవ్వడం వల్ల వచ్చిన వారికి చలి బెడద తప్పదని అంత అనుకున్నారు.
కానీ పెళ్లి వేడుకలో చలి మంట లు పెట్టడంతో వచ్చిన బందు మిత్రులు కొత్త వధువు వారుడిని ఆశీర్వదించారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు