లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు మురగదాస్ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలను చేసింది.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాలో కథానాయకగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో తన పాత్రపై అసహనం వ్యక్తం చేస్తుంది.ఈ చిత్రంలో రజినీ కూతురుగా నటించిన నివేత థామస్ కు ఇచ్చిన విలువలో నాకు సగం కూడా ఇవ్వలేదు.
సినిమాకు ముందు నా పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పిన దర్శకుడు, నా పాత్రకు సరైన న్యాయం చెయ్యలేక పోయారు.
గతంలో మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమాలోని నా పాత్రకు సరైన విలువ ఇవ్వలేదు ఓ జూనియర్ ఆర్టిస్ట్ మాదిరిగా అప్పుడు చూపించారు.
ఇప్పుడే అదే దర్శకుడి తో మరోసారి నాకు అన్యాయం జరిగిందని వాపోయారు.నయనతార ఫాన్స్ కుడా దర్బార్ చిత్రంలోని నయనతార పాత్రపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న నయన్ కు సరైన న్యాయం చేయ్యలకపోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.మరి కొద్దరు అయితే అసలు ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.