సంక్రాంతి పండగ మొదలైంది అంటే చాలు జనాలల్లో ఎక్కడలేని సంతోషం మొదలు అవ్వుతుంది.సంక్రాంతి అంటేనే తెలుగు వారిపండగా అనే విధంగా రంగు రంగుల ముగ్గులతో కొత్త అల్లుళ్ళతో, పిండి వంటకాలతో, కోడి పందేలతో, ఎడ్ల పందేలతో పండగ వాతావరణం సంతరించుకొంటది.
చిత్తూరు జిల్లా రంగపేటలో జల్లికట్టు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సంక్రాంతి పండగ కనుమ రోజున జల్లికట్టు వేడుకలను నిర్వహిస్తారు.
కాకపోతే ఇక్కడ తమిళనాడు జల్లుకట్టు మాదిరిగా కాకుండా చిత్తూరు జిల్లా జరిగే జల్లికట్టుకు చాల తేడ ఉంటుంది, రంకెలు వేస్తూ దూసుకువచ్చే కోడెద్దులకు పలకలు, టవల్స్ వాటి మెడకు కడుతారు వాటిని చేజికించ్చుకోవడం కోసం యువకులు పోటిపడుతారు.ఈ వేడుకులను చూడటానికి ఎంతో మంది వస్తూఉంటారు.
ఈ తరహా జల్లికట్టు వేడుకలను చూడటానికి మంచు ఫ్యామిలీ హాజరయ్యారు.మోహన్ బాబు అయన కుమారుడు మంచు మనోజ్ లు జల్లికట్టు లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారిని చూడటానికి రంగంపేటకు జనాలు పోటెత్తారు.వారికీ అభివాదం చేస్తూ మంచు మనోజ్ కొన్ని ఫొటోస్ ను ట్విట్టర్ దద్వారా షేర్ చేశారు.