ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఈ ఘటన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు నిరోధానికి నిర్భయ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు.
అయితే ఈ చట్టం మాత్రం దేశంలో పెరిగిపోతున్నా అత్యాచారాలు, హత్యలని నియంత్రించలేకపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఢిల్లీ కోర్టు ఇప్పటికే ఉరిశిక్ష ఖరారు చేసింది.
అయితే అందులో ముఖేష్ కుమార్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్ కారణంగా ఈ ఉరిశిక్ష వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఈ క్షమాభిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి కొట్టేసిన నేపధ్యంలో మరోసారి వీళ్ళ ఉరిశిక్ష విషయం చర్చకి వచ్చింది.
పిటీషన్ రద్దు కావడంతో వీరి ఉరిశిక్షని ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు తేదీ ఖరారు చేసింది.ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తెలిపింది.
తీహార్ జైల్లోనే నలుగురు దోషులకు ఉరి ఉంటుందని కోర్టు తెలిపింది.ఇక వీళ్ళ ఉరిశిక్ష ఖరారు కావడంతో దేశ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు.ఇక నిర్భయ తల్లి కూడా ఈ ఉరిశిక్షపై సంతోషం వ్యక్తం చేసింది.ఇక చనిపోయే ముందు దోషులకి తల్లిదండ్రులని చూసే అవకాశం ఢిల్లీ కోర్టు ఇచ్చినట్లు తెలుస్తుంది.