తాజాగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 11వ తారీకున విడుదలైంది అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
ఎంతలా అంటే విడుదలైన మొదటి రోజు నేనే దాదాపుగా 48 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసి మహేష్ బాబు సంక్రాంతి బరిలో తన సత్తా ఏంటో చూపించాడు.అయితే యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని చెప్పవచ్చు.
అయితే విడుదలైనప్పటి నుంచి ఈరోజుటి వరకు దాదాపుగా 85 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ వారాంతం కూడా దగ్గర పడుతుండడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు సెలవులు ఉండడం మరో ప్లస్ పాయింట్.
ఒకవేళ మహేష్ బాబు ఈ వసూళ్ల జోరు కొనసాగితే ఈ వారాంతంలోపు 100కోట్ల మార్కుని దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చిత్రంతో మహేష్ బాబు సరికొత్త రికార్డుని సృష్టించాడు.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ వసూళ్ల విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించగా సీనియర్ నటి విజయశాంతి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, సత్యదేవ్, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.