స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సినిమా సంగీతం గురించి ఎంత చెప్పుకునే తక్కువని చెప్పాలి.థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.ముఖ్యంగా పాటలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పొచ్చు.సామజవరగమన, రాములో రాములా వంటి పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.
ఈ పాటలు సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకున్న విషయం తెలిసిందే.యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టించాయి ఈ పాటలు.
కాగా ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్లో వచ్చే పాటను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.శ్రీకాకుళం యాసతో సాగే ఈ పాట ‘సిత్తరాల సిరపడు.
’ అంటూ సాగుతుంది.ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్ ఈ పాటను మరో సూపర్ హిట్గా మలిచింది.
సింగర్స్ సూరన్న, సాకేత్ ఈ పాటను పాడిన తీరు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.
మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని అంశాలు బాగా తోడ్పడటంతో ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.