సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్కు సంక్రాంతి సందడి తీసుకొచ్చాడు మహేష్.
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మహేష్ పర్ఫార్మెన్స్తో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీకి జనం ఫిదా అయ్యారు.
విజయశాంతి పర్ఫార్మెన్స్తో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తరువాత భారీ పారితోషకం తీసుకున్నది తానేనంటూ విజయశాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న కంటే కూడా విజయశాంతి రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది.
దాదాపు 13 ఏళ్ల గ్యాప్తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి క్రేజ్కు ఇదే నిదర్శనమని పలువురు అంటున్నారు.
కాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, ఆమె పర్ఫార్మెన్స్కు ఎంతిచ్చిన తక్కువే అని ఆమె అభిమానులు అంటున్నారు.
ఏది ఏమైనా విజయశాంతి రీఎంట్రీయే కాకుండా ఆమె రెమ్యునరేష్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.