ఆ బామ్మ చనిపోయింది

కొన్ని రోజుల క్రితం లండన్‌లో టీం ఇండియా క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఒక ఎన్నారై మహిళ స్టేడియంకు రావడం జరిగింది.ఆమెకు కోహ్లీ అంటే వీరాభిమానం.

 Bcci Announce The Nri Women Virat Kohili-TeluguStop.com

ఆ అభిమానంతోనే ఎనిమిది పదుల వయసులో కూడా ఆమె కోహ్లీని చూసేందుకు ఎంతో ఆసక్తితో స్టేడియంకు వచ్చింది.ఆమె గురించి తెలిసిన కోహ్లీ ఆమె వద్దకు వెళ్లి మరీ ఆమెతో మాట్లాడాడు.

ఆ సందర్బంగా తీసిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాను ముంచెత్తాయి.

ఇప్పుడు ఆ బామ్మ మరణ వార్త బీసీసీఐ ప్రకటించింది.

ఇటీవల ఆమె మరణించిందని, ఆమె మరణం చాలా బాధించిందని, ఆమె మరణించినా కూడా ఆమె ఇండియన్‌ క్రికెట్‌ టీంతో ఉంటారనే నమ్మకం ఉందని ఆమెకు శ్రద్దాంజలి ఘటిస్తున్నామన్నారు.ఆమె మరణంపై కోహ్లీ కూడా స్పందించారు.

ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన కోహ్లీ ఆమె మరణం నాకు చాలా బాధను కలిగించింది.ఆమె లాంటి అభిమాని ఉండటం ఎవరికైనా అదృష్టం అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube