తెలుగులో నాగ శౌర్య నటించిన టువంటి చలో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అటువంటి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస అవకాశాలతో తెలుగులో అదరగొడుతోంది.తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
అంతేకాక ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకుంది ఈ అమ్మడు.
అయితే తాజాగా ఈ రోజు బెంగుళూరులో ఉన్నటువంటి తన నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాలు ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగినట్లు తెలుస్తోంది.అయితే ఈ సోదాలు కు సంబంధించి వివరాలను మాత్రం అధికారులు గుట్టుగా ఉంచుతున్నట్లు సమాచారం.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్ర టీజర్ విడుదలై ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఈ చిత్రానికి చలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తి అయినట్లు వెంకీ కుడుముల పలు సందర్భాల్లో తెలిపారు.అంతేగాక ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.