తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి అల వైకుంఠపురంలో అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ కోట్లను కొల్లగొడుతోంది.
దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు.అంతేగాక తన తదుపరి చిత్రం కోసం కూడా పలు సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఇప్పటికే స్టైలిష్ స్టార్ బన్నీ తన తదుపరి చిత్రం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్నట్లు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే.కాకపోతే ఈ చిత్రం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో పాత్రలో నటి నటింపజేసేందుకు తమిళ హీరో విజయ్ సేతుపతి సంప్రదించినట్లు సమాచారం.దీంతో విజయ్ సేతుపతి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయిపోయాయి.ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ఓ యోధుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.దీంతో మరో మారు మెగా హీరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్నటువంటి తన మొదటి చిత్రంలో కూడా విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడు.