ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు పూజా హెగ్డే.ఈ అమ్మడు టాలీవుడ్లో స్టార్ హీరోలకు వాంటెడ్గా మారింది.
తాజాగా ఈమె అల్లు అర్జున్తో చేసిన అల వైకుంఠపురంలో సినిమా విడుదల అయ్యింది.ఆ సినిమాతో పూజా హెగ్డే సూపర్ సక్సెస్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
దాంతో ఈ అమ్మడు మరింత క్రేజ్ను పెంచుకుంది.ఇదే సమయంలో ఈ అమ్మడు మెగా హీరోలకు లక్కీ చామ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పూజా హెగ్డే ‘ముకుంద’ చిత్రంతో వరుణ్ తేజ్కు హిట్ ఇచ్చింది.ఆ సినిమా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్తో డీజే చిత్రాన్ని చేసింది.ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక అల్లు అర్జున్తో మళ్లీ అల వైకుంఠపురంలో సినిమాను చేసింది.ఇలా మెగా హీరోలతో చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.మెగా హీరోలతో కాకుండా ఇతర హీరోలతో ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.
అందుకే ఈ అమ్మడిని మెగా హీరోల లక్కీ చామ్ అంటూ పిలుస్తున్నారు.ప్రస్తుతం మెగా హీరోలు చేయబోతున్న సినిమాలకు ఈ అమ్మడినే హీరోయిన్గా బుక్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.పూజా హెగ్డే అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్తో తన పారితోషికాన్ని ఏకంగా రెండున్నర నుండి మూడు కోట్లకు పెంచబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి సంక్రాంతికి ఈ అమ్మడు విన్నర్గా నిలిచింది.