ప్రస్తుత కాలంలో మనుషులకి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటయ్యి తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు.తాజాగా టీవీ రిమోట్ కోసం గొడవ పడిన అక్క చెల్లెలల్లో అక్క ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక స్థానిక జిల్లాలోని పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి కాలనీ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్నారు.ఇందులో ఆ వ్యక్తి పెద్ద కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది.
చిన్న కూతురు ఇంట్లోనే ఉంటూ దగ్గరలో ఉన్న పాఠశాలలో చదువుతోంది.అయితే తాజాగా ఇంటర్మీడియట్ చదువుతున్నఆ యువతి సంక్రాంతి సెలవుల కారణంగా ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో టీవీ చూసే విషయంలో టీవీ రిమోట్ కోసం అక్కాచెల్లెళ్లుఎం ఇద్దరూ గొడవ పడ్డారు.ఈ గొడవలో చెల్లెలు నెగ్గడంతోతో అక్క అవమానంగా భావించింది.
దీంతో ఆమె వెంటనే తను ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే ఆ సమయంలో తండ్రి పని నిమిత్తమై బయటికి వెళ్లాడు.పని ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి ఆమె గదికి వెళ్ళగా ఆమె విగతజీవిగా కనిపించింది.దీంతో ఆ తండ్రి బోరున విలపించాడు.అలాగే చికిత్స నిమిత్తమై వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి నమోదు చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.