ఖాసీం సులేమానీ హత్యతో ప్రస్తుతం అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఇలాంటి పరిస్ధితుల్లో ఇరాన్ పరిస్థితిపై ఫేస్బుక్లో జోక్ పోస్ట్ చేసిన అమెరికాలోని భారత సంతతి ప్రొఫెసర్ను కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
డబ్ల్యూబిజెడ్ ప్రచురించిన కథనం ప్రకారం.అషీన్ ఫాన్సే అనే ప్రోఫెసర్ బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్లో ప్రత్యేకత కలిగిన బాబ్సన్ కాలేజీలో సస్టైనబిలిటీ విభాగంలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు.
ఇది బోస్టన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని వెల్లెస్లీలో ఉంది.ఇరాన్పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కు స్పందించిన ఆషీన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
సాంస్కృతిక ప్రదేశాలపై బాంబు దాడి చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధనేరమని, అలాగే డొనాల్డ్ ట్రంప్ వైఖరికి విరుద్ధమని అమెరికా అధికారులు చెప్పినట్లు అషీన్ తెలిపాడు.
అయితే మిన్నెసోటాలోని మాల్ ఆఫ్ అమెరికా, కర్దాషియన్ల నివాసం వంటి 52 ప్రాంతాలను ఇరాన్ బాంబు దాడులకు ఎంచుకోవాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో అషీన్ రంగంలోకి దిగాడు.ఫేస్బుక్లో తన మిత్రులకు చేసిన ఒక జోక్ని ప్రజలు ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్ధం చేసుకున్నారు.
అయితే తన కళాశాల యాజమాన్యం మద్ధతుగా నిలుస్తుందని ఆయన ఆశించారు.కానీ చివరికి ఆయన క్షమాపణలు తెలిపారు.