రోజూ ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ తో బిజీగా ఉన్నటువంటి మెగా కోడలు ఉపాసన తాజాగా కొత్త సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఆమె తన స్నేహితులతో కలిసి ఎవరెస్టు శిఖరం చేరుకొని అక్కడ ఎంతో మహిమ కలిగినటువంటి ముక్తినాథ్ ఆలయం, పశుపతినాథ్ ఆలయాల్ని దర్శించుకోవాలని బయలుదేరారు.
ఇందులో భాగంగా ముందుగా నేపాల్ చేరుకున్నారు.
అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడికి రాగానే దట్టమైన పొగతో కూడినటువంటి మంచు పడుతోంది.
దీంతో వాతావరణం అనుకూలించక వారి ప్రయాణానికి మధ్యలో ఆటంకం ఏర్పడింది.దీంతో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంపస్ లో ఆమె బస చేశారు.ఈ క్రమంలో దాదాపు 48 గంటలు గడిచిన వాతావరణం అనుకూలించక పోయేసరికి అక్కడే ఉండిపోయారు.ఈ క్రమంలో ఉపాసన తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ప్రపంచంలోనే ఎత్తైన టువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నా, పట్టుదల, ఆత్మస్థైర్యం ఎంతో అవసరమని అన్నారు.
అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి కంగారు పడకుండా ఒక్కో అడుగు వేస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.
అయితే వారు అనుకోని విధంగా జర్నీ కి బ్రేక్ పడటంతో లక్ష్మీనారాయణ త్రిపాఠి కి ఫోన్ చేశారు.దీంతో అతడు ముక్తినాథ్, పశుపతి నాథ ఆలయాల్ని దర్శించి మోక్షం పొందే వయసు కూడా ఇది కాదని కాబట్టి గోర్ఖాలో ఉన్నటువంటి మనకామ్నా దేవి ఆలయాన్ని సందర్శించిన చెప్పారు.దీంతో ఆమె లక్ష్మీనారాయణ పార్టీ చెప్పిన విధంగానే మన కామ్నా దివ్య ఆలయాన్ని దర్శించుకొన్నట్లు తెలిపారు.
అయితే ఈ జర్నీ కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అన్న విషయాలపై మాత్రం ఉపాసన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.