తలరాతను ఎవరూ మార్చలేరంటున్న ఉపాసన...

రోజూ ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ తో బిజీగా ఉన్నటువంటి మెగా కోడలు ఉపాసన తాజాగా కొత్త సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఆమె తన స్నేహితులతో కలిసి ఎవరెస్టు శిఖరం చేరుకొని అక్కడ ఎంతో మహిమ కలిగినటువంటి ముక్తినాథ్ ఆలయం, పశుపతినాథ్ ఆలయాల్ని దర్శించుకోవాలని బయలుదేరారు.

 Latest News About Upasana Konidela-TeluguStop.com

ఇందులో భాగంగా ముందుగా నేపాల్ చేరుకున్నారు.

అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడికి రాగానే దట్టమైన పొగతో కూడినటువంటి మంచు పడుతోంది.

దీంతో వాతావరణం అనుకూలించక వారి ప్రయాణానికి మధ్యలో ఆటంకం ఏర్పడింది.దీంతో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంపస్ లో ఆమె బస చేశారు.ఈ క్రమంలో దాదాపు 48 గంటలు గడిచిన వాతావరణం అనుకూలించక పోయేసరికి అక్కడే ఉండిపోయారు.ఈ క్రమంలో ఉపాసన తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ప్రపంచంలోనే ఎత్తైన టువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నా, పట్టుదల, ఆత్మస్థైర్యం ఎంతో అవసరమని అన్నారు.

అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి కంగారు పడకుండా ఒక్కో అడుగు వేస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.

Telugu Ram Charan, Ramcharan, Tollywood, Upasanakonidela-Movie

అయితే వారు అనుకోని విధంగా జర్నీ కి బ్రేక్ పడటంతో లక్ష్మీనారాయణ త్రిపాఠి కి ఫోన్ చేశారు.దీంతో అతడు ముక్తినాథ్, పశుపతి నాథ  ఆలయాల్ని దర్శించి   మోక్షం పొందే వయసు కూడా ఇది కాదని కాబట్టి గోర్ఖాలో ఉన్నటువంటి మనకామ్నా దేవి ఆలయాన్ని సందర్శించిన చెప్పారు.దీంతో ఆమె లక్ష్మీనారాయణ పార్టీ చెప్పిన విధంగానే మన కామ్నా దివ్య ఆలయాన్ని దర్శించుకొన్నట్లు తెలిపారు.

అయితే ఈ జర్నీ కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అన్న విషయాలపై మాత్రం ఉపాసన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube