స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో భారీ అంచనాల నడుమ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.మొదటి ఆట నుండే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.శనివారం ప్రీమియర్లతో ఈ సినిమా ఏకంగా 8 లక్షల 20 వేల డాలర్లు కొల్లగొట్టింది.
ఇక ఆదివారం ఉదయం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో చేరిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి.ఆదివారం ముగిసేసరికి ఈ సినిమా అక్కడ ఎంత రాబడుతుందనే అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
రిలీజ్ రోజునే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరిపోవడంతో ఈ సినిమా టోటల్ రన్లో ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా దుమ్ములేపుతున్నట్లు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.