భార్య భర్తల మధ్య గొడవలు ఉండటం, అవి కోర్టుల వరకు వెళ్ళడం సహజం.ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు విడిపోవడం కూడా జరుగుతుంది.
అలా విడిపోవడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి.అయితే కొంత మంది మహిళలు భర్తల నుండి విడిపోవడానికి విచిత్ర కారణాలు చెబుతారు అలాంటి ఓ కేసు మహిళా కమిషన్ ముందుకి వచ్చింది.
తన భర్త స్నాయం చేయడని, అసలు పరిశుభ్రత పాటించడని అలాంటి వ్యక్తితో తాను కాపురం చేయలేనని, తనకు విడాకులు ఇప్పించాలని కోరుతుంది.ఈ కేసు మహిళా కమిషన్ ని కూడా ఆశ్చర్యపరిచింది.
ఈ సంఘటన పూణేలో జరిగింది.
నా భర్త స్నానం చేయడు.
పళ్లు తోముకోడు.గడ్డం కూడా గీసుకోడు.
ఒక్కోసారి పదిరోజుల పాటు ఇలాగే ఉండిపోతాడు.అతడి దుర్గంధం భరించలేక పోతున్నాను.
నాకు విడాకులిప్పించండి అని పూణెకు చెందిన ఓ మహిళ రాష్ట్ర మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది.వారిద్దరికి సర్ది చెప్పేందుకు మహిళా కమిషన్ ఆమె భర్తని పిలిపించింది.
అతనితో మాట్తలాడింది.కార్నపెంటర్కు పని చేస్తున్న అతనికి భార్య ఫిర్యాదు గురించి తెలియజేసి అతని అభిప్రాయం అడిగింది.
భార్యతో కలిసుండాలని ఉందని అతడు చెప్పాడు.అయితే భార్య మాత్రం దానికి ఒప్పుకోలేదు.
తమకు పిల్లలు కూడా లేరని, తమ దాంపత్యం వ్యర్థమని స్పష్టం చేసేసింది.అలాగే తన నగలు తిరిగిచ్చేయాలని కోరింది.
పద్ధతి మార్చుకోవాలంటూ భర్తకు మహిళా కమిషన్ సూచించింది.వారికి రెండు నెలల గడువిచ్చింది.
అప్పటికి వారు కలిసి ఉండటానికి ఇష్టపడకపోతే విడాకులు ఇప్పించడానికి సిద్దమని మహిళా కమిషన్ చెప్పింది.మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.