సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత అడల్ట్ డేటింగ్ సైట్స్ ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.అబ్బాయిల వీక్ నెస్ ని అవకాశంగా వాడుకోవడానికి కొంత మంది అడల్ట్ డేటింగ్ సైట్స్ క్రియేట్ చేసి అందులో అందమైన అమ్మాయిల ఫోటోలని పెట్టేసి అబ్బాయిలకి వల విసురుతున్నారు.
అయితే లా డేటింగ్ సైట్స్ లో ఉన్న అందమైన అమ్మాయిల ఫోటోలలో ఉన్న వారు నిజంగా కాల్ గర్ల్స్ అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.కుర్రాళ్ళని ఆకర్షించడానికి సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియాలో దొరికే అమ్మాయిల ఫోటోలని డేటింగ్ సైట్స్ లో పెట్టేస్తున్నారు.
అయితే ఇవి చూసిన వారు అందులో ఉన్న అందరూ కాల్ గర్ల్స్ అని అనుకోవడం జరుగుతుంది.ఇప్పుడు అలాంటి వింత అనుభవం ఓకే కుర్రాడికి ఎదురైంది.
తాజాగా ఒక అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకున్న యువకుడుకి ఎదురైనా వింత అనుభవం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్లో వెలుగుచూసింది.
సూరత్ నగరానికి చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల క్రితం అదే నగరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.ఇద్దరూ రోజూ సెల్ఫోన్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఛాటింగ్ కూడా చేసుకునేవారు.
ఈ క్రమంలో ఆ యువతి తన ఫోటోలు కాబోయే భర్తకు పంపించగా.అతడు దాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.
తరువాత కొద్ది రోజులకి ఆ యువకుడి వాట్సాప్కు ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.కాల్గర్ల్స్ కావాలంటే సంప్రదించాలంటూ కొన్ని ఫోటోలు కూడా అవతలి వ్యక్తి పంపించాడు.
ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన ఆ యువకుడికి అందులో తనకి కాబోయే భార్య ఫోటో కనిపించింది.కాబోయే భార్య అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను చూసి కంగుతిన్నాడు.
తాను పెళ్లి చేసుకునేది కాల్ గర్ల్ అని ఫిక్స్ అయిపోయాడు.దీంతో ఆమెకు ఫోన్ చేసి తనను ఎందుకు మోసం చేశావంటూ నిలదీశాడు.
షాక్కు గురైన ఆ యువతి తనకే పాపం తెలీదని మొత్తుకుంది.అనుమానం వచ్చిన ఆ యువతి ఆ ఫోటోను తనకు పంపించాలని అతడిని కోరింది.
ఆమె చెప్పినట్లే ఆ ఫోటోను పంపించగా అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని గ్రహించి అసలు విషయం కాబోయే భర్తకు చెప్పింది.విషయం అర్ధం చేసుకున్న అతను, అమ్మాయితో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను శిక్షించాలని కోరారు.