తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి పండగ సందడి చేస్తుంది.ఈ సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది.
అయితే ఈ సినిమాలో వావ్ అనిపించేంత కంటెంట్ లేకపోయినా కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్నాయి.అటు పండగ సెలవులు కూడా రావడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన మైనస్ పాయింట్ను మరోసారి నిరూపించుకున్నాడు.అనిల్ రావిపూడి 2019 సంక్రాంతికి తెరకెక్కించిన ఎఫ్2 సినిమాను కామెడీతో బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.
అయితే ఈ సినిమాలో సెకండాఫ్ చాలా స్లోగా ఉండటం, కామెడీ అతిగా ఉండటంతో ప్రేక్షకులకు చిరాకు లేచింది.కానీ వెంకటేష్ తనదైన మార్క్ కామెడీతో మెప్పించాడు.
ఎలాగోలా ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా సెకండాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు చిత్ర యూనిట్.
ఫస్టాఫ్లోనే మహేష్ చేసే కామెడీతో ప్రేక్షకులు కొంతమేర అసహనానికి గురయ్యారు.ఇక సెకండాఫ్ సాగదీతలా కనిపించడంతో ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.
ఇలా రెండు సంక్రాంతి సినిమాలలో దర్శకుడు రావిపూడి సెకండాఫ్లో తన మైనస్ పాయింట్లను స్పష్టంగా చూపించాడు.మరి ఈ సెకండాఫ్ దెబ్బ నుండి అనిల్ రావిపూడి ఎప్పుడు భయటపడతాడో చూడాలి.