ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధనలు చేపట్టే అత్యంత శక్తివంతమైన పెద్దదైన సంస్థ నాసా( అమెరికా అంతరక్ష సంస్థ ).అమెరికాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా పేరొందిన నాసా.
ప్రస్తుతం చంద్ర మండలం, అంగారక గ్రహాలపై యాత్రలని చేపడుతోంది.ఈ యాత్రలో భాగంగా సుమారు 11 మంది వ్యోమగాములు వెళ్లనున్నారు.
ఈ 11 మందికి గత కొంత కాలంగా ఈ పరిశోధన విషయంలో తర్ఫీదుని ఇస్తున్నారు.అయితే
అంతరిక్షంపై పరిసోధనలకి గాను ఎంపిక కాబడిన అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న11 మందిలో భారత సంతతికి చెందిన రాజా చారి కూడా ఉన్నారు.వీరందరికీ నాసా ప్రత్యేకమైన శిక్షణని ఇస్తోంది.హ్యుస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో రెండేళ్ళ శిక్షణ తరువాత రాజా చారి గ్యాడ్యుయేట్ పొందారు.
ఈ క్రమంలోనే శిక్షణ విజయవంతం అయినందుకు గాను నాసా నుంచీ సిల్వర్ పిన్స్ అందుకున్నారు.
ఈ శిక్షణ అయిన తరువాత బంగారు పిన్స్ ఇవ్వడం నాసా సాంప్రదాయంగా వస్తోంది.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ నాసా యాత్రలో భారత సంతతి వ్యక్తులు అయిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ పాల్గొనగా తరువాత అంతటి గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు.రాజా చారి ని ఎంపిక చేయడం పట్ల పలు ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.