తెలుగు దేశం తరపున మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నందమూరి సుహాసిన మరోసారి మీడియా ముందుకు వచ్చింది.తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉంది.
ఈ సమయంలో ఆమె తెలుగు దేశం పార్టీ బాధ్యతలు నెత్తిన వేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తెలుగు దేశం పార్టీ తరపున అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం మరియు ఇతరత్ర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తుంది.
తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె తెలంగాణలో జరుగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది.తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థుల తరపున ఈమె ప్రచారం చేసే అవకాశం కూడా ఉందని సమాచారం అందుతోంది.
మొత్తానికి భవిష్యత్తులో ఈమె తెలంగాణ టీడీపీ బాధ్యతలను పూర్తిగా స్వీకరిస్తుందా అంటూ చర్చ జరుగుతోంది.ఒక వేళ ఈమె మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించినా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈమెకు తెలంగాణ టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.