టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సంగీత, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు, రామబ్రహ్మంలు కలిసి సంయుక్తంగా నిర్మించారు.
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినటువంటి ఈ చిత్రం థియేటర్లలో వర్షం కురిపిస్తోంది.మహేష్ యాక్షన్ సీన్స్ మరియు కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి.
దాంతో యుఎస్లో ఈ చిత్రం దూసుకు పోతోంది.
ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా దాదాపుగా $6,20,000 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు ఒక సమాచారం.అంతేగాకా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినందున ఈరోజు పూర్తయ్యే సమయానికి ఈ కలెక్షన్లు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.దీంతో యూఎస్ లో మహేష్ పంట పండినట్లు తెలుస్తోంది.