సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అప్పుడే యూఎస్ నుండి రివ్యూలు కూడా వచ్చేశాయి.
సినిమా టాక్పై ఒక క్లారిటీ వచ్చేసింది.పండగకు పర్వాలేదు అన్నట్లుగా సినిమా చూడాలనుకుంటే ఈ చిత్రం చూడవచ్చు అంటూ టాక్ వచ్చింది.
మహేష్బాబు ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ చిత్రం ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఇక ఇదే సమయంలో రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
రష్మిక మందన్న ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషించిందో ట్రైలర్లోనే క్లారిటీ వచ్చేసింది.మహేష్బాబును వెంట పడి మరీ ప్రేమించుకునేలా చేసే పాత్రలో రష్మిక కనిపించింది.ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఈ చిత్రంలో కాస్త ఓవర్ యాక్షన్ చేసింది అనే విమర్శలు ఎదుర్కొంటుంది.దర్శకుడు ఆమెకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.
దర్శకుడు ఆమెతో ఓవర్ యాక్షన్ చేయించాడు, అందులో రష్మిక తప్పు ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక మందన్న గీత గోవిందం చిత్రంలో చాలా హుందాగా కనిపించిన విషయం తెల్సిందే.ఆ పాత్రను చూసి ఈ పాత్రను చూస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉన్న మాట వాస్తవమే.కాని స్క్రీన్ప్లేకు ఆమె అల్లరి చిల్లరగా ఉండటం కరెక్ట్.
అయితే దర్శకుడు ఆమె పాత్రకు తక్కువ ప్రాముఖ్యత కల్పించి ఆమెకు అన్యాయం చేశాడు.రష్మిక అభిమానులు ఒకింత నిరాశ పడుతున్నారు.
రష్మిక కనిపించింది కొద్ది సమయమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.