సెలబ్రిటీ కిడ్స్ అంటే ఇంచు మించు వారికి కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది.ఒకప్పుడు నటులు తమ పిల్లలని ఆ స్టేటస్ కి దూరంగా పెంచిన ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాన్స్ తో తన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఈ కారణంగా వారికీ ప్రైవేట్ లైఫ్ ఉండదు.అయితే సెలబ్రిటీ కిడ్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఉపయోగించుకొని తమ క్రియేటివిటీ చూపిస్తూ తమ ఆనందాలని ఈ విధంగా వెతుక్కుంటున్నారు.
వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ముందు వరుసలో ఉంది.
మహేశ్ బాబు కూతురు సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో వారిద్దరు డిఫరెంట్ గా వీడియోలు చేస్తూ ఉంటారు.ఇక మహేష్ బాబు వీటిని షేర్ చేస్తూ ఉండటంతో లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి.వీరు చేసే వీడియోలు డిఫరెంట్ కంటెంట్ తో వినోదభరితంగా, విజ్ఞానభరితంగా ఉంటాయి.తాజాగా సితార, ఆద్యలు కలిసి సరిలేరు నీకెవ్హీవరు సినిమాలో మహేష్రో కి జోడీగా నటించిన రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు.
ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మహేష్ బాబు కూడా ఈ వీడియోని షేర్ చేయడంతో సూపర్ స్టార్ ఫాన్స్ ఈ వీడియో ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.