ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో ఎవరు చెప్పలేరు.అయితే ఆ కళని బయటికి తీసేవారు అప్పుడప్పుడు మన జీవితంలో ఎదురవుతారు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది తమ టాలెంట్ తో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోతున్నారు.ఏపీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఫేమస్ అయిన సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు.
ఇక తాజాగా ఓ డెలివరీ బాయ్ కూడా తన టాలెంట్ తో ఇప్పుడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు.విశాల్ అనే వ్యక్తి డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు.
ప్రతిరోజు లాగే ఓ వ్యక్తికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు.ఆ ఇంట్లో నిఖిల్ అనే వ్యక్తి డెలివరీ బాయ్ ని పలకరించి మంచినీళ్ళు ఇచ్చి మాటలు కలిపాడు.
వారి పరిచయంలో విశాల్ ఆర్టిస్ట్ అనే విషయం నిఖిల్ కి తెలిసింది.అతను గీసిన బొమ్మలు చూసి ఫిదా అయిపోయిన నిఖిల్ విశాల్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అతను గీసిన చిత్రాలని కూడా షేర్ చేశాడు.అతని టాలెంట్ కి తగ్గ పని కోసం ఎదురుచూస్తున్నాడు అని పేర్కొన్నాడు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు అతని ప్రతిభను చూసి మెచ్చుకుంటూ అతనికి ఆర్డర్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు.మరికొంతమందైతే జాబ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.
ఒక్క ట్వీట్తో అతని టాలెంట్ ప్రపంచానికి పరిచయం కావడం ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడం జరిగింది.దీనిపై విశాల్ మాట్లాడుతూ నా గురించి ట్వీట్ చేశారని నాకు తెలియదు.
నేను మామూలుగా ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాను.అప్పుడు ఆ వ్యక్తి నా గురించి అడిగితే ఆర్టిస్ట్నని చెప్పాను.
నేను గీసిన చిత్రాలు చూసిన అతనికి నా పని నచ్చినట్లుంది.అందుకే ట్వీట్ చేశాడనుకుంటానని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఇప్పుడు విశాల్ డ్రాయింగ్స్ కి ఒక్క ట్వీట్ తో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.