టార్గెట్ 30.. ఫిక్స్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మరో రెండు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు.

 Mahesh All Set For 30 Crores On Day 1 With Sarileru Neekevvaru-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్ అండ్ టీమ్ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో పాత రికార్డులకు పాతర వేయాలని మహేష్ బాబు చూస్తున్నాడు.

అదిరిపోయే కథతో వస్తున్న మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ రోజునే అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తోంది.ఓపెనింగ్ రోజునే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.30 కోట్ల మేర వసూళ్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మహేష్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని మిగిలిస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో 30 నిమిషాలపాటు సాగే ట్రెయిన్ సీన్ అద్భుతంగా ఉంటుందని, ఆ సీన్‌ను ఎవ్వరూ మిస్ కావద్దని చిత్ర యూనిట్ కోరుతోంది.

మరి తొలిరోజే 30 కోట్ల మేర వసూళ్లపై కన్నేసిన మహేష్ అండ్ టీమ్‌కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube