ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో ధోని ముందు ధోని తర్వాత అని చెప్పాలి.భారత్ కి రెండు ప్రపంచ కప్ లు అందించిన సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా, మిస్టర్ కూల్ గా ధోని ఇండియన్ క్రికెట్ చరిత్రలో తన పేరుని లిఖించుకున్నాడు.
ఓ విధంగా చెప్పాలంటే అతను తిరుగులేని కెప్టెన్, అలాగే తిరుగులేని ఆటగాడు కూడా.అయితే క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడి కెరియర్ అయిన ఒక్కోసారి గాడి తప్పడం అలాగే ఒక వయసు వచ్చాక రిటైర్మెంట్ గురించి ఎక్కువగా చర్చించడం జరుగుతుంది.
సచిక్ లాంటి క్రికెట్ గాడ్ రిటైర్మెంట్ గురించి, కెరియర్ చివరిదశలో అతని ఆట గురించి విమర్శలు వచ్చాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ధోని కూడా అదే స్థితిలో ఉన్నాడు.
ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం వన్డే, టీ-20లో కొనసాగుతున్నాడు.త్వరలో వన్డే క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నాడు.
ఇదిలా ఉంటె ఇటీవల భారత్ ఆడిన సీరిస్ లకి సెలక్షన్ కమిటీ ధోనిని పరిగణంలోకి తీసుకోలేదు.ఇక ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది టీ-20 ప్రపంచ కప్ జరగనుంది.
మరి దీనికి ధోనిని ఎంపిక చేస్తారా అనే డౌట్ చాలా మందిలో ఉంది.ఈ విషయం మీద టీం ఇండియా కోచ్ రావిశాస్త్రీ కీలక వాఖ్యలు చేశారు.
ఐపీఎల్లో బాగా ఆడితేనే టీ-20 ప్రపంచకప్ పోటీలో ధోనీ ఉంటాడు.అతను ఎప్పుడూ జట్టుకు భారంగా కాదు.
ఐపీఎల్లో ఫామ్ ధోనీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని తేల్చేసాడు.