దేశంలో కొత్త పౌరచట్టంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.ముఖ్యంగా ఢిల్లీలోని జేఎన్యూలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అందులోని విద్యార్థులను గతంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.విద్యార్థులు దాడికి ప్రయత్నిస్తే లాఠీ చార్జ్ చేశామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు మొహానికి మాస్క్లు పెట్టుకుని అమ్మాయిలు మరియు అబ్బాయిలు కొందరు జేఎన్యూలోని ముస్లీం విద్యార్థులపై దాడికి దిగారు.
విద్యార్థులపై దాడికి దిగిన వారు ఎవరు అంటూ ప్రస్తుతం అంతా చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ వారు మరియు జేఎన్యూ విద్యార్థులు కొందరు ఈ దాడి చేసింది ఏబీవీపీ కార్యకర్తలు అంటూ ఆరోపిస్తున్నారు.అందుకు సంబంధించిన కొన్ని మెసేజ్ స్క్రీన్ షాట్స్ను కూడా చూపిస్తున్నారు.
ఏబీవీపీ వారికి మాత్రమే ఇది సాధ్యం అని బీజేపీ వారు కావాలని వారితో ఈ దాడి చేయించారు అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.జేఎన్యూ విద్యార్థుల దాడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు.