పాత తరం కథానాయికల్లో విజయశాంతి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో మనందరికీ బాగా తెలుసు.అయితే ఈమె కొన్నేళ్ల క్రితం సినిమాలు మానేసి ప్రజలకు సేవ చేయాలని దృక్పదంతో రాజకీయాల్లోకి వెళ్ళారు.
ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ప్రజల మన్ననలు పొందుతూ రాజకీయాల్లో కూడా బాగానే కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.అయితే తాజాగా ఈమె టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
దీంతో ఈ చిత్రంపై ఈమె భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం కొంతమంది దర్శక నిర్మాతలు విజయశాంతి డేట్స్ కోసం వెళ్లగా విజయశాంతి తన డేట్లు కావాలంటే కొన్ని షరతులను వారి ముందు పెట్టిందట.
అవేంటంటే తనకు తన చిత్రంలో నటిస్తున్నటువంటి కథానాయికకు సమానంగా పారితోషకం ఇవ్వాలని, అంతేగాక ఈ చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని లేకపోతే చేయని తెగేసి చెప్పేసింది.దీంతో కొందరు దర్శకులు కొన్ని చిత్రాల్లో అయితే ఓకే గాని మరి అన్ని చిత్రాలలోనూ అంటే కొంచెం కష్టం అవుతుందని అంతేగాక హీరోయిన్ కి సమానంగా పారితోషికం ఇవ్వడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తారీకున విడుదల అవుతోంది.అలాగే మరుసటి రోజున స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించినటువంటి అలా వైకుంఠపురంలో చిత్రం విడుదల అవుతోంది.ఇవి రెండు పెద్ద హీరోల చిత్రాలు కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.