అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లో హీరో బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్.మొదటి సినిమాతోనే భారీ బడ్జెట్ తో వివి వినాయక్ లాంటి స్టార్ దర్శకుడుతో సినిమా చేసిన ఈ హీరో తరువాత వరుసగా అందరూ పేరున్న దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అయితే అతని సినిమాలు హిట్ కాకున్నా వెనక తండ్రి ఉండి నడిపించడంతో కమర్షియల్ హీరోగా మారాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే చాలా సినిమాల తర్వాత రాక్షసుడు సినిమాతో ఈ హీరోకి కెరియర్ మొదటి సక్సెస్ వచ్చింది.
అయితే అది రీమేక్ సినిమా కావడంతో బెల్లంకొండ బాబుకి వచ్చిన క్రేజ్ పెద్దగా ఏమీ లేదు.తండ్రి ప్రోత్సాహంతో సినిమాలు చేస్తున్న ఈ యువ హీరో లిస్టు లో మరో మూడు సినిమాల వరకు లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.
తన కోసం వచ్చే ప్రతి కథను ముందుగా తన తండ్రి బెల్లంకొండ సురేష్ కచ్చితంగా వినాల్సిందే అంటా.
ఆయనకు నచ్చి ఒకే చేస్తే ఆ కథ తన వరకు వస్తుందని చెప్పాడు.ఇక తన తండ్రి ఒకే చెప్పిన కథని మేగ్జిమం ఫైనల్ చేసేస్తానని చెప్పాడు.
అయితే తన సొంత నిర్ణయాల కంటే తన తండ్రి ఒపీనియన్ కి ప్రాముఖ్యం ఇస్తానని చెప్పారు.నాన్నకి సినిమా ఇండస్ట్రీపై అపార అనుభవం ఉందని, ఆయనకీ కథల జడ్జిమెంట్ విషయంలో రైట్ నిర్ణయం ఉంటుందని, అందుకే ఆయమ మాటకి ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు.
అయితే బెల్లంకొండ కెరియర్ లో కొద్దో గొప్పో సక్సెస్ అయిన సినిమా అంటే అది రాక్షసుడు మాత్రమే.మరి తండ్రి ఒపీనియన్ తోనే ఆ సినిమాలు చేసి బెల్లంకొండ బాబు ఫ్లాప్ లు ఎందుకు కొట్టాడు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.