ఆస్ట్రేలియా ప్రధాని టార్గెట్గా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కేవలం ఆస్ట్రేలియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మారిసన్పై నిప్పులు కక్కుతున్నారు.
అసలు ఈ ప్రధానికి బుద్ది ఉందా, ఇతడు ఎలా ప్రధాని అయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.వెంటనే ఇలాంటి ప్రధానిని తొలగించాలనే డిమాండ్ కూడా వస్తుంది.
ఇంతకు ఈయన చేసిన తప్పేంటి, ఈయన వ్యవహరించిన తీరు ఏంటీ ఎందుకు జనాలు ఇంతగా విమర్శిస్తున్నారంటే.
ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తుంది.
వేల హెక్టార్ల అటవి ఇప్పటికే దహించబడింది.దాన్ని ఆర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దాదాపుగా 20 మంది చనిపోయారంటూ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే అంతకు మించి చనిపోయి ఉంటారు అంటూ స్థానికులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించి ప్రధాని పూర్తిగా ఆ కార్చిచ్చు ఆర్పేసేందుకు తనవంతు సూచనలు ఇస్తూ ఉండాలి.కాని ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మద్య జరుగబోతున్న మూడవ టెస్టు మ్యాచ్ను జనాలు చూడాలంటూ ఆయన పిలుపునిచ్చాడు.
అంతే కాకుండా ఆస్ట్రేలియా జట్టుతో భేటీ అయ్యి వారితో ముచ్చటించి, పార్టీ చేసుకున్నాడు.ఈ కారణంగానే ఆస్ట్రేలియన్స్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.