స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్నాయంటేనే ఇతర హీరోలు తమ సినిమాలను వాయిదా వేస్తారు.అలాంటి ఇద్దరు లేదు ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారంటే వారితో పోటీకి ఎవ్వరు సాహసం చేయరు.
కానీ ఇప్పుడు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ను షేక్ చేయాలని సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు.
అయితే ఈ స్టార్ హీరోలకు థియేటర్ల విషయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.
కేవలం ఒక్కరోజు గ్యాప్లో వస్తున్న ఈ సినిమాలే ఎలా ఆడుతాయా అని అందరూ టెన్షన్ పడుతున్నారు.కానీ ఎలాంటి టెన్షన్ లకుండా స్టార్ హీరోలకు బ్యాండ్ బాజా ఇస్తానంటున్నాడు ఓ చిన్న హీరో.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు ధీమాగా ఉన్నారు.
నిజానికి వారి ధీమాకు సరైన కారణం కూడా ఉంది.ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సతీష్ వేగ్నేష 2017లోనూ ఇలాంటి పరిస్థితిలో తన సినిమా శతమానం భవితి రిలీజ్ చేసి ఇద్దరు స్టార్ హీరోల బాక్సాఫీస్ హిట్లకు సరిసమానంగా తన సినిమాను కూడా హిట్ చేయించాడు.చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటు శతమానం భవిత కూడా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
దీంతో ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలో సమానంగా కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమా సక్సెస్ కావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.మరి మహేష్, బన్నీలకు కళ్యాణ్ రామ్ ఎలాంటి బొమ్మను చూపిస్తాడో తెలియాలంటే సంక్రాంతి పండగ వరకు ఆగాల్సిందే.