నందమూరి బాలయ్య తాజాగా రూలర్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది.భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బాలయ్యకు ఇప్పుడు హిట్ ఖచ్చితంగా అవసరం అయ్యింది.
దీంతో బాలయ్య తనకు సూపర్ హిట్ సినిమాలు అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి తన తాజా చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సరిసమానంగా ఓ లేడీ పాత్ర కూడా ఉంటుందని, అయితే అది విలన్ పాత్ర కావచ్చనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ పాత్ర కోసం బోయపాటి శ్రీను నటి రోజాను సంప్రదించగా ఆమె బాలయ్యతో సినిమాకు ససేమిరా అందట.దీంతో సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతితో ఈ పాత్ర చేయించాలని పట్టుబట్టాడట బోయపాటి.
ఎలాగైనా విజయశాంతిని ఆ పాత్ర కోసం ఒప్పించాలని మరో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి విజయశాంతికి తన కథలోని పాత్రను వివరించాడట.అయితే విజయశాంతి బోయపాటికి ఔనని చెప్పలేదట, కాదని చెప్పలేదట.దీంతో బోయపాటి డైలమాలో పడ్డాడట.తన సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి బాలయ్యతో పాటు తాను ఓ అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.