శ్రీరెడ్డి గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్స్ను ఎంతగా భయపెట్టిందో తెల్సిందే.
ఇప్పటికి కూడా ఈమె నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో, ఏ సమయంలో ఎలాంటి ఫేస్ బుక్ పోస్ట్ పెడుతుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది.అలాంటి శ్రీరెడ్డి పేరుమీద ఒక సినిమా రాబోతుంది.
ఆ సినిమా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.సినిమాకు శ్రీరెడ్డికి సంబంధం ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
కాని శ్రీరెడ్డి బాధితులు ఈ సినిమాతో భయపడుతున్నారు.
శ్రీరెడ్డి దొరికి పోయింది అంటూ టైటిల్ పెట్టి మానవ మృగాలకు అనే క్యాప్షన్ను పెట్టడంతో అసలు ఈ సినిమా ఉద్దేశ్యం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఇంతకు ఈ సినిమా టైటిల్ కేవలం పబ్లిసిటీ కోసమే పెట్టారా లేదంటే శ్రీరెడ్డి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఇందులో ఉంటాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.శ్రీరెడ్డి పేరుతో ఈ టైటిల్ ఉండటం వల్ల ఇప్పటికే ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కింది.
షూటింగ్ స్టార్ట్ అయ్యింది.మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో హర్రర్ అంశాలు చూపించబోతున్నట్లుగా ఫస్ట్లుక్ను చూస్తుంటే అనిపిస్తుంది.ఆర్యన్ మరియు ఉపాసన జంటగా రూపొందుతున్న ఈ చిత్రంకు రాహుల్ పరమహంసా దర్శకత్వం వహించబోతున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కంటెంట్ ఎలా ఉంటుందో కాని పేరు కారణంగా సినిమాకు పబ్లిసిటీ అయితే దక్కింది.ఈ పేరు పెట్టడం వల్ల సినిమాలో ఇండస్ట్రీకి సంబంధించిన ఏమైనా విషయాలు బయటకు వస్తాయో అనే భయం వ్యక్తం అవుతుంది.ఒక నిర్మాత తనయుడితో శ్రీరెడ్డి సంబంధంను ఈ చిత్రంలో చూపిస్తారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.