టాలీవుడ్ లో దాదాపుగా అందరి ప్రముఖుల హీరోలతో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన ఈ భామ ప్రస్తుతం సక్సెస్ కోసం ఆరాటపడుతోంది.
తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి అభినేత్రి 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఈమె నటించిన మరో చిత్రం సైరా నరసింహారెడ్డి.
ఈ చిత్రం ఫర్వాలేదనిపించినా ఇందులో తమన్నా పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అవకాశాలు తెచ్చి పెడుతుందనుకున్న ఈ చిత్రం కూడా తమన్నా కి నిరాశే మిగిల్చింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించిన తమన్నా తానేం ఖాళీగా లేనని తన చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయని తొందర్లోనే వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది.దీంతో ఒక్కసారిగా ఆమె గుసగుసలు వినిపిస్తున్న అన్ని పటాపంచలు చేసింది.
అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించింది ఈ అమ్మడు.అంతేగాక మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న టువంటి సిటీ మార్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.ఇవన్నీ చూస్తుంటే తమన్న మాటలు నిజమే అనిపిస్తుంది.అంతేగాక టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్లపై ఇలాంటి వార్తలు తరచూ వస్తుంటాయని వీటిని తన పెద్దగా పట్టించుకోనని తమన్నా అంటోంది.