తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి లోఫర్ అనే చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించిన దిశాపటాని తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడుకి తెలుగులో పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు.
దీంతూ ఈ అమ్మడు తన మకాంని బాలీవుడ్ కి మార్చింది.అయితే బాలీవుడ్ లో భాగీ-2 చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటించి మెరిసినా ఆ తర్వాత సరైన హిట్ లేక అక్కడ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఈ అమ్మడు.
అయితే తాజాగా దిశా పటాని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 2020వ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫోటోలను షేర్ చేసింది.దీంతో దిశా అభిమానులు విషెస్ మాట పక్కన పెట్టి ఆమె ఫోటలనే చూస్తూ పండగ చేసుకుంటున్నారు.
మరికొందరైతే ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దిశా పటాని కే టినా, రాధే, మలంగ్ వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది.కనీసం ఈ సంవత్సరంలోనై దిశా పటానికి ఒక మంచి హిట్ వచ్చి మంచి అవకాశాలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం…
.