జనసేన అధినేత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పించారు.రాజధాని అమరావతిలో పర్యటించిన పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
రాజధాని విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న తీరు సరికాదంటూ పవన్ మండిపడ్డారు.తుళ్లూరులో మాట్లాడిన పవన్ రాజధాని విషయంలో అమరావతి ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతుగా పోరాడాలని సూచించారు.
టీడీపీ కూడా ఈ పోరాటానికి బలమైన బాధ్యత తీసుకోవాలి.ఇంత వ్యవహారం జరుగుతున్నా రెండు కళ్ల సిద్ధాంతం, ఒంటి కన్ను సిద్ధాంతం అంటూ సాకులు చెబితే కుదరదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఒక మాట, ఒక ధర్మం మీదే మీరు నిలబడాలంటూ చంద్రబాబు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
నన్ను అడిగే హక్కు నీకు లేదు.ఇక్కడ ఉన్నది జగన్, చంద్రబాబు కాదు పవన్.
ఆ రోజు నన్ను అడిగి రాజధాని ఇవ్వలేదు.నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు అంటూ పవన్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.