ప్రస్తుతం హైదరాబాదు నగరంలో 2020 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ పలకడానికి చేస్తున్న సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
కానీ హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేసే ప్రధాన అర్చకుడు మాత్రం జనవరి 1వ తారీఖున ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చెబితే వారి చేత గుంజీలు తీయిస్తానని అంటున్నారు.అసలు ఇంతకీ ఎవరు ఆ పూజారి, అసలు ఆ విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదులోని ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది.అయితే ఈ ఆలయానికి గానూ పండుగలు మరియు పర్వదినాలు సెలవు రోజుల్లో భక్తులు విశేషంగా వస్తుంటారు. అయితే ఇందులో పని చేస్తున్నటువంటి ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రంగరాజన్ మాత్రం ఆలయ పరిసర ప్రాంతంలో ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న లేదా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన వారికి పనిష్మెంట్ తప్పదని అంటున్నారు.
ఈ పనిష్మెంట్ లో భాగంగా వాళ్లు గుంజీలు తీయాల్సి ఉంటుందని సెలవిచ్చారు.
అంతేగాక హిందూ ధర్మం ప్రకారం మనకు ఉగాది పర్వదినాన కొత్త సంవత్సరం మొదలవుతుందని అందువలన ఆ రోజున శుభాకాంక్షలు చెప్పుకోవచ్చని అన్నారు.అంతేగాక ప్రతిఒక్కరూ సనాతన ధర్మాలను గౌరవించడంతో పాటు ఆచరించడం కూడా నేర్చుకోవాలని సూచించారు.