టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడుగా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమాకి కొత్త ఒరవడి సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాలతో సహవాసం చేస్తూ తన ఇమేజ్ ని పోగొట్టుకున్నాడు.అతని మీద ఉన్న గౌరవం ఇప్పుడు చాలా మందికి లేదు.
ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేస్తూ ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ హడావిడి చేస్తున్నాడు.వివాదాస్పద కథలని తీసుకొని రిలీజ్ కి ముందు హడావిడి చేయడం తరువాత విషయం లేని సినిమాతో ఆడియన్స్ ని చిరాకు పెట్టడం అలవాటుగా చేసుకున్నాడు.
చెత్త సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులని విసిగిస్తున్న ఆర్జీవి తాజాగా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.కేవలం రెండు కులాల మధ్య ఆధిపత్య పోరుని, ఏపీ రాజకీయాల చుట్టూ తిప్పి తన స్వంత ఇగో కోసం చేసిన ఆ సినిమా థియేటర్ లో డిజాస్టర్ గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో తెరకెక్కించిన బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్ లో ఆర్జీవి ఉన్నాడు.తన శిష్యుడుని తెరకెక్కించిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ఆర్జీవి ఏపీ, తెలంగాణ మొత్తం చుట్ట్టేస్తున్నాడు.
బోల్డ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో హీరో, దర్శకుడు కాకుండా, ఆర్జీవి, హీరోయిన్ మాత్రమే కనిపిస్తున్నారు.హీరోయిన్ తో స్టెప్పులు వేస్తూ, కుర్రాళ్ళకి జోష్ నింపుతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా విజయవాడలో సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మీద ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను దేవుడిని నమ్మని, నాకు అంతకంటే మా అమ్మ ఎక్కువ.
అమ్మ మీద ఒట్టేసి చెబుతున్న నాకు శ్రీదేవి కంటే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం అని కామెంట్స్ చేశారు.ఇప్పుడు ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం ఉంటే అతనిని ఎందుకు నెగిటివ్ గా చూపించావ్ అని కొందరు కామెంట్ చేస్తే, ఆర్జీవి తన సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.