వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎంకు గుదిబండలా మారారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలనాత్మక విమర్శలు చేశారు.విజయ సాయి రెడ్డి చర్యల కారణంగా జగన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారాయణ విమర్శించారు.
అలాగే కొత్తగా ఏర్పాటు కాబోతున్న రాజధాని విశాఖలో భూ మాఫియా మితిమీరి పోయిందని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందని వైసీపీ మీ టిడిపి నాయకులకు ముందే తెలుసునని అందుకే ముందుగానే భూములను సేకరించి పెట్టుకున్నారని నారాయణ విమర్శించారు.ఇటువంటి వారిని నియంత్రించాల్సిన జగన్ వాటిని మరింత ప్రోత్సహిస్తున్నారు అంటూ నారాయణ విమర్శించారు.
మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం నియమించిన కమిటీపైన నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.కమిటీలతో జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం జగన్ ప్రభుత్వానికి లేదని అందుకే అసెంబ్లీలో విశాఖపట్నం అయితే రాజధానిగా బాగుంటుందని స్పీకర్ చెబుతున్నారని నారాయణ అన్నారు.జగన్ ఏమో మూడు రాజధానులను పరిశీలిస్తున్నామని అంటున్నారన్నారు.
చివరిగా జగన్ ఆలోచన మేరకే కమిటీ నివేదిక వస్తుందని నారాయణ జోస్యం చెప్పారు.జీఎన్ రావు కమిటీ ఇప్పటివరకు గుమస్తా పనిచేసిందని, అంతకుమించి మరి ఏమీ చేయలేదని నారాయణ మండిపడ్డారు.