సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ లేఖ... స్పందించిన రాష్ట్రపతికి

టీడీపీలో ఎంపీగా ఉంటూ అక్రమ ఆస్తులు, ఆర్ధిక నేరాలు, మనీ ల్యండరింగ్ లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి సుజనా చౌదరీ.టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత విధేయుడుగా ఉండటంతో పాటు, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఫండింగ్ చేసిన సుజనా చౌదరి తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత కేసుల విచారణ తప్పించుకోవడానికి టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరిపోయాడు.

 Sujana Chowdary Ycp Mp To President-TeluguStop.com

ఈ నేపధ్యంలో అతని మీద నడుస్తున్న కేసుల విచారణ కూడా కొంత స్తబ్దుగా ఉంది.ఇదిలా ఉంటే సుజనా చౌదరి కేసుల మీద ఎలా అయిన విచారణ జరిపించి అతన్ని జైల్లో పెట్టించాలని వైసీపీ నేతలు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే సుజనా చౌదరి నేరాలపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాసారు.ఈ లేఖపై రాష్ట్రపతి స్పందించి దానిని హోం మంత్రిత్వ శాఖకి పంపించినట్లు తెలుస్తుంది.

రాష్ట్రపతి నుంచి లేఖ నేరుగా హోం మంత్రిత్వ శాఖకి అనుబంధంగా ఉన్న ఈడీ అధికారులకి వెళ్ళినట్లు తెలుస్తుంది.విజయసాయిరెడ్డి ఫిర్యాదు రాష్ట్రపతి కార్యాలయం నుంచి హోంమంత్రిత్వ శాఖకు చేరడం ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా సుజనా చౌదరి ఏపీ రాజధానుల వ్యవహారం మీద మాట్లాడటం, అలాగే ప్రతి సారి జగన్ ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంతోనే విజయసాయి రెడ్డి లేఖ రాసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube