దారుణం: మంటల్లో కాలి బూడిదైన ఇద్దరు చిన్నారులు...

ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లా మైనపొదర్ గ్రామంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దారుణంగా కాలి బూడిదైన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

 Odisha Burned In Fire-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు వారి కుటుంబంతో నివసిస్తున్నారు.

వారికి ఎలీన, సుజాత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.వీరికి సుమారు నాలుగేళ్ల వయస్సు ఉంటుంది.

అయితే వీరి ఇల్లు మొక్కజొన్న తోటకు సమీపాన ఉంటుంది.దీంతో అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఆ తోటలో ఆడుకుంటున్నారు.

అయితే ఉన్నట్లుండి మొక్కజొన్న తోటకు నిప్పు అంటుకుంది.దీంతో చిన్నారులు ఇద్దరూ మంటల నుండి బయటకు రాలేక అందులోనే ఉండి సజీవదహనమయ్యారు.

అయితే ఇది గమనించిన చుట్టుపక్కల స్థానికులు నీళ్లతో మంటలను ఆర్పినా అప్పటికే తీవ్ర గాయాలు అయ్యి చిన్నారులు ఇద్దరు మృతి చెందారు.
 

Telugu Odisha, Odisha Latest-Telugu Crime News(క్రైమ్ వార్�

దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతుళ్లు చనిపోవడంతో ఆ కుటుంబం బోరున విలపించింది.అలాగే ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.అయితే ఈ ఘటనలో చిన్నారులను ముందుగా గమనించిన ఎటువంటి వారి మేనత్త బసంత వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె తీవ్ర గాయాలు పాలయ్యింది.

దీంతో చుట్టుపక్కల స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తమై దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube