పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు.
అయితే గతంలో మరో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ సినిమా అటక్కెకిందంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.కానీ అది నిజం కాదని తెలుస్తోంది.
క్రిష్ డైరెక్షన్లో పవన్ సినిమా ఖచ్చితంగా ఉందని, దానికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈసినిమాలో పవన్ ఓ దొంగ పాత్రలో నటిస్తాడని, సినిమాకు బందిపోటు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
బందిపోటు అనే టైటిల్ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.ఇక పింక్ తెలుగు రీమేక్ చిత్రంలో హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి, అనన్య నటించనున్నారు.
కాగా బందిపోటు సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.